Chhath Puja: అత్యంత వైభవంగా ఛత్ పూజ

Sat, 21 Nov 2020-8:15 am,

ఉత్తర భారతదేశంలో ఛత్ పూజ అత్యంత వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున మహిళలు నదీ తీరాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి సూర్యునికి నివేదనలు సమర్పిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. మహిళలు వైభవంగా పూజలు చేస్తున్నారు. 

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఛత్ పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. 

ఈ సందర్భంగా మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి సూర్యునికి ప్రార్ధనలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఘాట్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. 

కరోనా కాలంలోనూ ఛత్ పూజల కోసం మహిళలు పెద్ద ఎత్తున నదీతీరాలకు తరలిరావడంతో ఆయా ప్రాంతాలు భక్తిపారవశ్యంతో ప్రకాశిస్తున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link