Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..

Wed, 24 Jul 2024-10:04 am,

నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తండ్రిబాటలో హీరోగా ఇప్పటికీ సత్తా చూపిస్తూనే ఉన్నాడు.

అంతేకాదు ఒక నట వారసుడిగా అడుగుపెట్టి ఇప్పటికీ హీరోగా కంటిన్యూ అవుతున్న వారు ఎవరు లేరు. ఆగష్టు 29తో నటుడిగా బాలయ్య 50 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర సీమ ఆయన్ని ఘనంగా సత్కరించాలనే ప్లాన్ చేసింది.

ఈ సందర్భంగా బాలయ్య నటుడిగా పరిచయమైన చిత్రం ‘తాతమ్మ కల’. ఎన్టీఆర్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో కేంద్రం బ్యాన్ చేసింది. ఈ సినిమాలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణతో పాటు భూ గరిష్ఠ చట్టాన్ని వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత బ్యాన్ విధించింది.

ఈ విషయమై ఎన్టీఆర్ కోర్టు కెక్కారు. అంతేకాదు ప్రభుత్వం చెప్పినట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్లీ 1975 సంక్రాంతి కానుకగా విడుదల చేసారు. ఈ న్యూ వెర్షన్ లో ఓ కలర్ పాటను యాడ్ చేసారు. అంతేకాదు క్లైమాక్స్ లో ముసలవ్వ భర్త పాత్రగా ముసలి ఎన్టీఆర్ పాత్రను యాడ్ చేసారు.

ఒక రకంగా ఈ సినిమా మొత్తం భానుమతి పాత్రపై నే నడుస్తోంది. ఆమె కలను నెరవేర్చే ముని మనవడి పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం. ఈ సినిమాలో హరికృష్ణ కూడా బాలయ్య అన్న పాత్రలో నటించారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ కలిసి నటించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.  ఈ సినిమాలో ఎన్టీఆర్ భానుమతి భర్తగా.. మనవడిగా ద్విపాత్రాభినయం చేసారు.

ఆ తర్వాత ఎన్టీఆర్, బాలయ్యలు నటించిన ‘శ్రీ మద్విరాట పర్వం’ సినిమా కూడా ఇదే రూట్లో సెన్సార్ కత్తెరకు గురైంది. ఆ తర్వాత అన్నగారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రం విడుదలైంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link