Drinking Water Precautions: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఈ 7 సమస్యలు తప్పవా, ఎప్పుడు తాగాలి

Sat, 10 Aug 2024-8:35 am,

నీళ్లు మనిషి శరీరానికి చాలా చాలా అవసరం. నీటి కొరత ఉంటే బాడీ డీ హ్రైడ్రేట్ అవుతుంది. అయితే భోజనం చేసిన వెంటనే లేదా భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయనే విషయం మీకు తెలుసా. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 

భోజనం చేసిన వెంటనే లేదా భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియలో భాగమయ్యే ఎంజైమ్ బలహీనమవుతుంది. దాంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

భోజనంతో పాటు లేదా భోజనం వెంటనే నీళ్లు తాగుతుంటే శరీరంలో కేలరీల అవశేషాలు పెరిగిపోతాయి. దాంతో బరువు పెరుగుతారు. అంతే కాకుండా మలబద్ధకం సమస్య ఉత్పన్నమౌతుంది. జీర్ణక్రియలో ఆటంకం కలుగుతుంది. 

భోజనం చేసేటప్పుడు లేదా చేసిన వెంటనే నీళ్ళు తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. అంటే పింపుల్స్, నల్లని మచ్చలు వంటివి. అంతేకాకుండా శరీరంలో చలి పుడుతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది

భోజనంతో పాటు లేదా భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే శరీరంలో పోషకాల సంగ్రహణ తగ్గిపోతుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు రావ్చు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, అలసట వంటివి కన్పిస్తాయి. 

అందుకే భోజనం చేయడానికి అరగంట ముందు నీళ్లు తాగాలి. భోజనం చేసిన అరగంట తరువాతే నీళ్లు తాగాలి. భోజనం చేసే సమయంలో అంటే మధ్యలో నీళ్ళు తాగాల్సి వస్తే కొద్దిగానే తీసుకోవాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link