Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నుంచి దీపావళి వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!

Mon, 07 Oct 2024-11:04 am,

శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి చాలా లేటుగా సంచారం చేస్తుంది. అయితే ఈ గ్రహం అక్టోబర్ 3న శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించింది. దీపావళి తర్వాత వరకు ఈ గ్రహ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.   

శని గ్రహం నవంబర్‌ 15వ తేది వరకు అదే శతభిషా నక్షత్రంలోకి సంచార దశలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

శని సంచారం కారణంగా వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి జీవితంలో అనేక సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అలాగే వీరు కెరీర్‌ పరంగా కూడా బోలెడు లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

మిథున రాశి వారికి కూడా ఈ నక్షత్ర సంచారం జరగడం కారణంగా అనేక శుభఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.   

శని గ్రహ సంచారం కారణంగా కుంభ రాశివారికి అన్ని కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వీరికి ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.   

మీన రాశివారికి కూడా శని నక్షత్ర సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు వీరు జీవితంలో అద్భుతమైప రోజులు గడుపుతారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link