Mohammad Azharuddin: లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే హవా.. మాజీ ఎంపీ అజారుద్దీన్ జోస్యం

Tue, 02 Jan 2024-12:57 pm,

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని.. కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామన్నారు. 

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే అందులో రెండు గ్యారంటీలను అమలు చేశారని గుర్తు చేశారు.  

కేంద్రంలో రాహుల్ నాయకత్వంలో తమ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే  అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా పని చేస్తున్నారని మెచ్చుకున్నారు.   

ఈ సందర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ.. ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో అత్యధిక ఎంపీ సీట్లను గెలుస్తుందని జోస్యం చెప్పారు.   

సచివాలయంలో మంత్రులను కలసి సందడిగా ముచ్చటించారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఫహీం, కాంగ్రెస్ నేత అసదుద్దీన్ ఉన్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link