Expensive Houses: ఇండియాలో టాప్ 5 ఖరీదైన ఇళ్లు ఎవరివో తెలుసా, వాటి ధర ఎంత

Sun, 12 Sep 2021-1:36 pm,

ప్రపంచంలో రెండవ అత్యంత ధనికుడైన హీరో షారుఖ్ ఖాన్ ఇళ్లు కూడా టాప్ 5 జాబితాలో ఉంది. షారుఖ్ ఖాన్ ఇంటి పేరు మన్నత్. ముంబైలో ఉంది. టాప్ 10 హౌసెస్ జాబితాలో ఉంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం ఈ ఇంటి ధర దాదాపుగా 2 వందల కోట్లు ఉంటుంది. 

ఈ ఇంటి పేరు జిటియా హౌస్. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా 2015లో  మాలాబార్ హిల్‌లో 30 వేల చదరపు అడుగుల్లో ఉన్న జటియా హౌస్ కోసం 425 కోట్లకు వేలం పాడారు. 2012లో 4 వందల కోట్లకు విక్రయమైన మహేశ్వరి హౌస్ రికార్డును..ఈ ఇళ్లు బద్దలు కొట్టింది. 

పూణావాలా గ్రూప్  ఛైర్మన్ సైరస్ పూణావాలా...ముంబైలోని బీచ్ క్యాండీలో ఉన్న కాన్సులేట్ భవనం లింకన్ హౌస్ కోసం వేలం పాడారు. పీటీఐ నివేదిక ప్రకారం 750 కోట్లకు వేలం పలికింది. 2015లో జరిగిన వేలం ఇది. ఇది దేశంలోని బంగ్లాల్లో అతి ఖరీదైంది.

ఈ ఇంటి పేరు ఎబోడ్. బాంద్రాలో ఉన్న అనిల్ అంబానీ ఇళ్లు. ఇది దేశంలోని రెండవ అతి ఖరీదైన ఇళ్లు. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం ఈ ఇంటి విలువ 5 వేల కోట్లుంటుంది. ఇది 66 అంతస్థుల భవనం. ఇందులో స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్ సౌకర్యాలన్నీ ఉన్నాయి.

ఈ ఇంటి పేరు ఏంటిల్లా. దేశంలోని అతి ఖరీదైన ఇళ్ల జాబితాలో మొదటి స్థానం ఈ ఇంటిదే. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇళ్లు ఇది. ఏంటిలా ఇళ్లు కేవలం ఇండియానే కాదు ప్రపంచంలోని అతి ఖరీదైన ఇళ్లలో ఒకటి. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఫోర్బ్స్ మేగజైన్ నివేదిక ప్రకారం ఈ ఇంటి ధర 7 వేల 337 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఇంటిలో 27 ఫ్లోర్లు ఉన్నాయి. ఇందులోంచి 6 ఫోర్లు కేవలం పార్కింగ్ కోసమే కేటాయించారు. ఈ ఇంటిలో అన్ని లగ్జరియల్ సౌకర్యాలు, వసతులు పుష్కలంగా ఉన్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link