Facts About Garuda Puranam: మృతదేహాన్ని వంటరిగా వదిలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Fri, 13 Sep 2024-6:04 pm,

హిందూ పురాణాల ప్రకారం.. మృతదేహాన్ని ఒంటరిగా ఉంచడం వల్ల కాలం చేసిన మనిషి ఆత్మ ఎంతో సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మోక్షం కూడా లభిస్తుందని శాస్త్రంలో పేర్కొన్నారు.   

అలాగే మృతదేహానికి సంబంధించిన కొన్ని విషయాలను గరుడ పురాణాల్లో కూడా క్లుప్తంగా వివరించారు. గరుడ పురాణం ప్రకారం, మృతదేహాన్ని ఒంటరిగా ఉంచడం వల్ల ఏం జరుగుతుందో.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

గరుడ పురాణంలో చనిపోయిన మృతదేహాన్ని ఒంటరిగా వదిలేయడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చుట్టుపక్కల ఉండే అన్ని రకాల దుష్టశక్తులు మరణించినవారి శరీరంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

అంతేకాకుండా దుష్టశక్తులు సులభంగా బాడీ నుంచి ఇంట్లోకి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని పురాణాల్లో వెల్లడించారు. దీంతో పాటు ఈ శక్తులు ప్రవేశించడం వల్ల చనిపోయిన వారి ఆత్మ చాలా కాలం అశాంతిగా ఉంటుంది.

అలాగే మృతదేహంలోకి ఆత్మలు సంచారం చేయడం వల్ల.. వారి కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని గరుడ పురణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.   

ఒంటరిగా మృతదేహాన్ని వదిలివేయడం వల్ల ఆత్మ 13 రోజుల పాటు అక్కడే తిరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆత్మ కూడా శాంతించదని శాస్త్రంలో వెల్లడించారు.   

అలాగే గరుడ పురాణం ప్రకారం ఎవరైనా చనిపోయినప్పుడు రాత్రి పూట కూడా దహనం చేయడం మంచిది కాదు.. కాబట్టి సరైన సమయాల్లో దహనం చేయడం వల్ల ఆత్మ శాంతించే ఛాన్స్‌ కూడా ఉంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link