Heroine Love: ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యమంత్రి కొడుకుకు కన్ను కొట్టిన స్టార్‌ హీరోయిన్‌

Wed, 16 Oct 2024-3:18 pm,

పెళ్లయి 21 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా కొనసాగుతున్న జంట జెనీలియా డిసౌజ, రితేశ్ దేశ్ ముఖ్

బాలీవుడ్‌లో అందమైన జోడీ రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లయి రెండు దశాబ్దాలు అవుతున్నా వీరు అన్యోన్యంగా ఉంటూ వివాహ బంధాన్ని మరింత పెంచుకుంటున్నారు.

వీరి ప్రేమ కథ సినిమా కథను మించి ఉంది. ఒక ముఖ్యమంత్రి కుమారుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు.

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రితేష్ కనిపిస్తే జెనీలియా పట్టించుకోలేదంట. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావు కుమారుడు రితేశ్‌ కావడంతో అంతగా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

జెనీలియా, రితేశ్‌ తొలిసారి హైదరాబాద్‌లోనే కలుసుకున్నారు. అది 'తుజే మేరీ కసమ్' సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్‌లో కలుసుకోవడం విశేషం.

'తుజే మేరీ కసమ్' సెట్స్‌లో జెనీలియా, రితేశ్‌ పరిచయమై స్నేహితులుగా కొనసాగారు. హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రితీష్ జెనీలియాను చాలా మిస్ అయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

మళ్లీ ‘మస్తీ’ చిత్రంలో జెనీలియా, రితేశ్‌ కలిసి నటించారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

కొన్నాళ్లు ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. కొన్నాళ్లకు పెళ్లి చేసుకోవాలనుకుని నిశ్చయించుకోగా రితేశ్‌ తండ్రి విలాస్‌ రావు మాత్రం ఈ పెళ్లిని ఇష్టపడలేదంట. 

రితేశ్‌కి జెనీలియా అంటే చాలా ఇష్టం. ఈ సమయంలో జెనీలియాకు బెదిరింపులు వచ్చాయి. అయినా పట్టు వదలకుండా ఎన్నో ప్రయత్నాల తర్వాత విలాసరావుకు వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించారు. 

కుటుంబసభ్యుల అంగీకారంతో 2012 ఫిబ్రవరి 3వ తేదీన జెనీలియా, రితీష్ దేశ్‌ముఖ్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కొడుకులు రియాన్‌, రాహిల్‌.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link