Gold Rate Today In Hyderabad: కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు, వెండి ధరలు

Tue, 18 May 2021-8:10 am,

Gold Rate Today 18 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు కొండెక్కుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా నాలుగోరోజు పెరిగాయి. తాజాగా రూ.270 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,260 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,150కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కరోనా సెకండ్ వేవ్‌లోనూ బంగారం ధరలు తగ్గడం లేదు. తాజాగా బంగారం ధర రూ.290 మేర పెరగడంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,500కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా పెరిగింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.72,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర పెరిగింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link