Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు జోష్, వెండి ధరలు పైపైకి

Fri, 19 Mar 2021-8:55 am,

Gold Price Today 19 March 2021: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పెరిగాయి. వారం రోజులుగా పసిడి నిలకడగా ఉన్న బులియన్ మార్కెట్ తాజాగా జోష్ అందుకుంది. పసిడి ధరలు పెరగగా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్ కేంద్రాలలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.46,040కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,200 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read: Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ ఇవే

దేశ రాజధాని ఢిల్లీలో ఆరు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పెరిగాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,380 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350కి చేరింది.

Also Read: Android Smartphone: మీ మొబైల్ పోయిందా, దాన్ని కనుగొని Data Erase చేయడానికి ఇది చదవండి

బులియన్ మార్కెట్‌లో నిన్న సాయంత్రం తగ్గిన వెండి ధరలు నేడు పెరిగాయి. వెండి ధర రూ.700 మేర పెరగగా, తాజాగా 1 కేజీ వెండి ధర రూ.67,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా పెరిగింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.72,500 అయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link