Gold Price In Hyderabad 28 April 2021: బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, Silver Price

Wed, 28 Apr 2021-8:37 am,

Gold Price In Hyderabad 28 April 2021: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పుంజుకున్నాయి. బంగారం ధరలు స్వల్పంగా పుంజుకోగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధరలు పెరుగుతున్నాయి.

Also Read: 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు

Gold Price In Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలలో మూడోరోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు పెరిగాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.240 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,700కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,640 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో Cash విత్‌డ్రా చేయవచ్చు

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు దిగొచ్చాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.290 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,170 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,990కి పతనమైంది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.200 పెరిగింది. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.69,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.74,000 వద్ద మార్కెట్ అవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link