Gold Price Today: రూ.50వేల చేరువలో బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి ధరలు

Thu, 21 Jan 2021-7:20 am,

బులియన్ మార్కెట్‌లో ఇటీవల తగ్గిన బంగారం, వెండి ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు(Gold Price Today), వెండి ధరలు పెరిగాయి. నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌(Hyderabad)లలో బంగారం ధర రూ.160 మేర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.49,960 అయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 అయింది.

Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రూ.110 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,260 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.110 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.47,910కి చేరింది.

Also Read: Voter ID Updation: మీ ఓటర్ ఐడీలో తప్పులున్నాయా.. నిమిషాల్లో సరిదిద్దుకోండి

ఢిల్లీలో వెండి ధర రూ.700 మేర పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,500 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.600 మేర పుంజుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.71,300కు చేరింది.

Also Read: PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link