Gold Price Today 6th January 2021: భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి ధర పైపైకి!

Sat, 23 Jan 2021-8:47 am,

కొత్త సంవత్సరం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజా మరోసారి బంగారం ధర పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర(Gold Price Today) పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధర పెరిగింది.

Also Read: Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.760 మేర భారీగా పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.52,360కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.700 మేర పెరగడంతో ధర రూ.48,000 అయింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.1,180 మేర పుంజుకుంది. తాజాగా 10 గ్రాముల ధర రూ.54,700 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.1,080 మేర భారీగా పెరడంతో 10 గ్రాముల ధర రూ.50,150కి చేరింది.

Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!

బంగారం ధరలతో పోటీపడి వెండి ధరలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.400 మేర భారీగా పుంజుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.74,500 అయింది. ఢిల్లీలో వెండి ధర తాజాగా రూ.100 మేర స్వల్పంగా తగ్గింది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.70,200కు దిగొచ్చింది.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link