Gold Rate In Hyderabad 08 July 2021: కరోనా ఎఫెక్ట్, నిలకడగా బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు

Thu, 08 Jul 2021-12:16 pm,

Gold Rate Update 08 July 2021: దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. తాజాగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ పతనమయ్యాయి.

Also Read: EPFO Medical Advance: గంటలో ఈపీఎఫ్‌వో మెడికల్ అడ్వాన్స్‌గా రూ.1 లక్ష సాయం

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు అనిపించడంతో బంగారం ధరలు పెరిగాయి. గత రెండు రోజులుగా కరోనా కేసులు పెరగడంతో నేడు పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,710 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,650 వద్ద మార్కెట్ అవుతోంది.

ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు నిలకడగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పుంజుకున్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,860 అయింది. అదే సమయంలో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,810 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

Also Read: EPFO Benifits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి

వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. దేశ రాజధానిలో వెండి ధర రూ.1000 మేర పతనం కావడంతో నేడు 1 కేజీ వెండి రూ.69,000కు క్షీణించింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో నేడు వెండి ధర రూ.600 మేర దిగొచ్చింది. 1 కేజీ వెండి ధర రూ.73,500కు పతనమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link