Gold Rate Today In Hyderabad: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, మిశ్రమంగా వెండి ధరలు

Wed, 12 May 2021-8:13 am,

Gold Rate Today 12 May 2021: దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పెరగగా, హైదరాబాద్‌లో వెండి ధర దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు తాజాగా పెరిగాయి. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,770 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,700 వద్ద మార్కెట్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.100 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,100 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,100కి చేరింది.

దేశ రాజధానిలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర స్వల్పంగా పుంజుకుంది. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,600కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.500 మేర దిగొచ్చింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,000కి పతనమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link