Ilaiyaraaja Biopic Launch Event: ధనుశ్ ప్రధాన పాత్రలో మేస్ట్రో ఇళయరాజా బయోపిక్ లాంఛనంగా ప్రారంభం..

Thu, 21 Mar 2024-2:19 pm,

స్వరరాజా ఇళయరాజా పాటలకు అభిమానులు కానీ వారు ఎవరు ఉండరు. ఈయన జీవితంలో కావాల్సినంత స్టోరీ ఉంది. ఈయన బయోపిక్ తెరకెక్కిస్తారని చెప్పినప్పటి నుంచి అభిమానులు కూడా ఈ బయోపిక్ ఎపుడు స్టార్ట్ అవుతుందా అని  ఎదురు చూసారు. ఎట్టకేలకు మ్యూజిక్ మ్యాస్ట్రో 'ఇళయరాజా' బయోపిక్ చెన్నైలో ప్రారంభమైంది.

ఈ వేడుకకు యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో రెట్రో లుక్‌లో ఇళయరాజాలా ఉన్న ధనుశ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.

ధనుశ్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్‌లతో 'కెప్టెన్ మిల్లర్' మూవీని తెరకెక్కించిన అరుణ్ మాదేశ్వరన్ ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాను కనెక్ట్ మీడియా, PK ప్రైమ్ ప్రొడక్షన్, మరియు మెర్క్యూరీ మూవీస్ బ్యానర్ పై శ్రీరామ్ భక్తిశరణ్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, ఇళంపర్తి గజేంద్రన్ నిర్మిస్తున్నారు

కె.నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ  సినిమాకు ముత్తురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ బయోపిక్ లాంఛ్ ఈవెంట్‌లో ఇళయరాజా పాల్గొన్నారు. ఇంకా డైరెక్టర్ వెట్రిమారన్, త్యాగరాజన్ కుమారరాజా సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుశ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఇళయరాజా పాటలు విని పెరిగిన నేను ఆయన పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link