Sudarshan Setu: దేశంలో అతి పొడవైన కేబుల్ వంతెన రేపే ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

Sat, 24 Feb 2024-10:12 pm,

ఈ వంతెన ప్రారంభం తరువాత సొంత వాహనంపై ఆనందంగా వెళ్లిరావచ్చు. ముఖ్యంగా స్థానికులకు సైతం చాలా రిలీఫ్ కలగనుంది.

దేశంలోనే అతి పొడవైన కేబుల్ వంతెన ఇదే. పుట్‌పాత్ రెండువైపులా పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంటుంది. 

బెట్ ద్వారక-ఓఖా మధ్య నిర్మించిన 2.5 కిలోమీటర్ల కేబుల్ వంతెనలో 12 వ్యూ పాయింట్ గ్యాలరీలున్నాయి. ఫుట్‌పాత్ రెండువైపులా భగవద్గీత శ్లోకాలు, చిత్రాలు రూపుదిద్దుకున్నాయి.

ఈ సిగ్నేచర్ వంతెన నిర్మాణం 2017లో ప్రారంభమైంది. ఏడేళ్ల తరువాత ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్దమైంది. 

ద్వారకాధీశ్ మందిరం

ఈ సిగ్నేచర్ వంతెన పొడవు 2.5 కిలోమీటర్లు. ద్వారకాధీశుని ఆలయానికి వెళ్లే భక్తులు, స్థానికుల కోసం ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన కారణంగా 5 గంటల ప్రయాణం కాస్తా 3 గంటల్లో పూర్తి కానుంది.

978 కోట్లతో సిద్ధమైన కేబుల్ వంతెన

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రేపు ఈ వంంతెన ప్రారంభం కానుంది. గుజరాత్‌లో 978 కోట్లతో ఈ వంతెన నిర్మితమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link