IPL 2024: ఐపీఎల్ 2024లో ఈ భారత వికెట్ కీపర్లే అన్ని ప్రాంచైజీలకు టార్గెట్

Thu, 07 Dec 2023-8:49 pm,

సంజూ శామ్సన్ 2015 టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకూ కేవలం 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లే ఆడాడు. మొత్తం 374 పరుగులు చేశాడు. 

సంజూ శామ్సన్‌కు కూడా మంచి అవకాశాలుండవచ్చు. వన్డే ప్రపంచకప్ 2023కు ముందే ఐర్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. సంజూ శామ్సన్‌ను దక్షిణాఫ్రికా పర్యటనకు సైతం ఎంపిక చేశారు. సంజూ ఈ సిరీస్ తరువాత ఐపీఎల్ 2024లో ఎంపిక కావచ్చని అంచనా. 

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు పోటీలో ఉండే మొదటి వ్యక్తి కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అద్బుతమైన వికెట్ కీపరే కాకుండా మంచి బ్యాటర్ కూడా. 

పంజాబ్‌కు చెందిన యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా టీ20 సిరీస్‌లో ఆడే అవకాశం లభించింది. రానున్న ఐపీఎల్ ఆడేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాడు. జితేష్ శర్మ ఇప్పటి వరకూ 5 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 64 పరుగులు చేశాడు. 

ఇషాన్ కిషన్ కూడా తరచూ టీమ్ ఇండియాకు ఆడుతుంటాడు. 25 ఏళ్ల ఇషాన్ కిషన్ 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 796 పరుగులు సాధించాడు. ఇందులో  ఆరు అర్ధ సెంచరీలున్నాయి. మొత్తం 72 టీ20 మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ 3 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 4435 పరుగులు స్కోర్ చేశాడు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link