Jr NTR: వారసుల ఎంట్రీపై ఫాన్స్ కి షాక్ ఇచ్చిన తారక్.. మా లెగసి వాళ్ళకి అవసరం లేదు!

Tue, 08 Oct 2024-12:28 pm,

ఎన్టీఆర్ తన పిల్లలు అయినా అభయ్ రామ్,  భార్గవ్ రామ్ లను ఇండస్ట్రీకి తీసుకురావడంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఈ హీరో చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నారు..

గతంలో ఆయన మాట్లాడుతూ.. నాకు నచ్చిన రంగాన్ని వారిపై ఒత్తిడి చేయడం కంటే వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో వారినే నిర్ణయించుకోవాలని నేను వారితో చెప్పాను అంటూ తెలిపారు ఎన్టీఆర్.   

నా కుమారులు నా అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం లేదు. నేను కేవలం వారికి ఆదర్శంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ వెల్లడించారు 

అయితే వారు పెరుగుతున్న వాతావరణం సినిమా రంగానికి చెందిన కాబట్టి వారు కూడా నటులు కావాలని కోరుకుంటున్నారు అంటూ ఎన్టీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆలోచన నటన వైపు ఉంది.. మరి భవిష్యత్తులో వారు ఇండస్ట్రీలోకి వస్తారో రారో నాకు తెలియదు. 

ఒకవేళ వారు ఇండస్ట్రీ లోకి రావడానికి ఆసక్తి చూపించకపోయినా.. వారిని  నేను బలవంత పెట్టను అంటూ అభిమానులకు షాక్ ఇచ్చారు తారక్. మొత్తానికి అయితే పిల్లల భవిష్యత్తును వారికే నిర్ణయించుకునే స్వాతంత్రాన్ని కల్పించి గొప్ప తండ్రిగా పేరు సొంతం చేసుకున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తదుపరి పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link