Keerthy Suresh: సమంత బాటలోనే కీర్తి సురేష్.. ఇక అభిమానులకు బాధ తప్పదా!

Sun, 21 Jul 2024-5:23 pm,

తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన నేను శైలజా చిత్రం.. ద్వారా తెలుగుపేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఆ తరువాత నానితో చేసిన.. నేను లోకల్ చిత్రం కూడా ఈమెకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది.

అయితే ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధించినప్పటికీ..కీర్తి సురేష్ కి.. ఓ రేంజ్ లో పేరు మాత్రం తెచ్చిపెట్టలేకపోయా. బాగా ఆ పని చేసి పెట్టింది మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రం. ఈ సినిమాతో తెలుగులో కీర్తి సురేష్.. రేంజ్ మారిపోయింది. 

ఈ సినిమాకి కానీ నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకుంది కీర్తి సురేష్. మహానటి సావిత్రి బయోపిక్గా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించి.. అందరి దగ్గర ప్రశంసలు అందుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత నుంచి కీర్తి సురేష్ కి తెలుగు తమిళంలో బోలేదని ఆఫర్లు వచ్చాయి. 

కానీ అవన్నీ ఫ్లాపులు కావడం ఆమె అభిమానులను కొంత నిరాశకి గురి చేశాను. కాగా మళ్లీ నాని దసరా.. సినిమాతో మంచి విజయం అందుకుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ప్రస్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్ లో సైతం బేబీ జాన్ అనే సినిమాతో తన ఎంట్రీ ఇవ్వనుంది. 

అయితే కీర్తి సురేష్.. ఈమధ్య తెలుగు, తమిళ సినిమాలు పెద్దగా ఒప్పుకోవటం లేదు. మరోపక్క హిందీలో మరో రెండు సినిమాలు సైన్ చేసినట్లు వినికిడి.  మరోపక్క సమంత కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది. ఇదంతా చూస్తుంటే వీరిద్దరూ.. సౌత్ కన్నా ఎక్కువ నార్త్లో సినిమాలకి ప్రిఫరెన్స్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఇదేగాని జరిగితే సమంత అభిమానులు లాగా కీర్తి సురేష్ అభిమానులకు కూడా బాధ కలగక తప్పదు!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link