Mahalaya Paksham: పితృ దోషాలంటే ఏమిటి..? ఈ దోషాల వల్ల కలిగే నష్టాలేమిటి.. ?

Thu, 19 Sep 2024-8:10 am,

పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవ ప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి.

శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారు.

ప్రతి మాసంలోను అమావాస్య , పితరుల పుణ్య తిథిగా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది.

ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో ఆనందింపజేస్తే వారు తమ సంతతి వారి ఆయువు, విద్య , ధనం , సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కాని ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది.

అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలాన్నిస్తుందనేది ప్రతీతి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link