Navaratri: సంచలన నిర్ణయం.. నవ రాత్రులు 9 రోజులపాటు చికెన్‌, మటన్‌ విక్రయాలు బంద్‌..!

Wed, 02 Oct 2024-3:27 pm,

Meat Banned During Navaratri: రేపటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చికెన్‌, మటన్‌ విక్రయాలు బ్యాన్‌ చేసింది యూపీ ప్రభుత్వం. అక్టోబర్‌ 3 నుంచి 12 తేదీ వరకు ఈ విక్రయాలను బ్యాన్‌ చేసింది యోగీ ప్రభుత్వం.  

మార్కండేయ పురాణం ప్రకారం ఈ నవరాత్రులు 9 అవతారాలను పూజిస్తారు. దుర్గా మాతను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ సమయంలో కొంతమంది భక్తులు ఉపవాసాలు కూడా పాటిస్తారు. మహర్నవమి రోజు హవనం నిర్వహిస్తారు. దసరాతో ఈ ఉపవాసం విరమిస్తారు.  

మహర్నవవి రోజు కలశ స్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో మాంసం విక్రయాలు అయోధ్యలో 9 రోజులపాటు బ్యాన్‌ చేస్తున్నట్లు సీఎం యోగీ ఆధిత్యనాథ్‌ నిషేధించారు. కొన్నిరిపోర్టుల ప్రకారం అక్టోబర్‌ 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు.   

ఈ సందర్భంగా అయోధ్య డిస్ట్రిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ మాంసం సంబంధించిన ఉత్పత్తులు ఈ తొమ్మిది రోజులపాటు బ్యాన్‌ చేశారు. అయోధ్యలోని ఫుడ్‌ సేఫ్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదేశాలను జారీ చేశారు. ఇది నాన్‌ వెజ్‌ విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా వర్తిస్తాయి.  

అన్ని హోటళ్లకు కూడా ఈ ఆదేశాలను జారీ చేశారు. ఏవరైనా ఈ విక్రయాలు జరిపితే 0527-8366607 కాల్‌ చేయాలని కోరారు. అయోధ్య రామమందిరంలో బాలరాముడి కొలువై ఉన్నాడు. అయితే, ఆల్కహాల్‌కు సంబంధించిన అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link