Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో `మెలోడి`` మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..

Sat, 15 Jun 2024-3:18 pm,

నరేంద్ర మోదీ ఇటీవల మన దేశానికి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ 3.0 అంటూ తన మార్కు చూపిస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారినికి హజరైన మోదీ.. మరల  జీ7 సదస్సుకు హజరయ్యేందుకు వెళ్లారు.  

మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి విదేశీ పర్యటనకు ఇటలీకి వెళ్లారు. అది కూడా ఆయన జీ7 సమ్మిట్ కు హజరవ్వడానికి వెళ్లడంతో అది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో మోదీ జీ 7 సదస్సులోని సభ్యదేశాలతో జరిగిన సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక మోదీ.. ఇటలీ  ప్రధాని జార్జియా మెలోనితో కలిసి దిగిన సెల్పీలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. గతంలో కూడా వీరిద్దరు కాప్28 సదస్సులో ఇదే విధంగా సెల్ఫీలు దిగారు.

ఈ నేపథ్యంలో సరదాగా.. మెలోనీ... మోదీతో సెల్ఫీ దిగి.. ఎక్స్ ఖాతాలో.. హయ్ ఫ్రెండ్స్.. ఫ్రమ్ మోలోడీ అంటూ క్యాప్షన్ జతచేశారు. దీంతో ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది.

గతేడాది కూడా మోదీ.. దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సమ్మిట్ లో పాల్గొన్నారు. అప్పుడు కూడా వీరిద్దరు సెల్ఫీలు దిగి తమ ఖాతాలో పోస్టు చేశారు. దానికి మెలోడి వచ్చేలా.. హ్యష్ ట్యాగ్ జతచేశారు.

ఇదిలా ఉండగా.. ఈ ఫోటోపై మోదీ స్పందిస్తు.. స్నేహితుల్ని కలుసుకొవడం ఎంతో ఆనందంగా ఉందంటూ రిప్లై ఇచ్చారు. జీ 7 సదస్సులో అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాల అధినేతలు హజరయ్యారు. మోదీ ఇటీవల హ్యట్రిక్ పీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయా దేశాధినేతలు మోదీకి స్పెషల్ విషేస్ చెప్పారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link