Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. స్టార్ పేసర్ రీఎంట్రీ.. ఇదిగో అప్‌డేట్..!

Wed, 24 Jul 2024-1:27 pm,

వన్డే వరల్డ్ కప్ తరువాత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. షమీ ఎప్పుడెప్పుడు గ్రౌండ్‌లోకి దిగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

తాజాగా రీఎంట్రీపై షమీ క్లారిటీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు.  

"బంతి నా చేతిలో ఉంది. ఆడాలనే కోరిక హృదయంలో ఉంది. మ్యాచ్‌కు రెడీ అవుతున్నా.." ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.  

సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొనడమే లక్ష్యంగా షమీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.  

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ తరువాత షమీ మళ్లీ మ్యాచ్ ఆడలేదు. మహ్మద్ షమీ రీఎంట్రీపై కొత్త కోచ్ గౌతం గంభీర్ కూడా క్లారిటీ ఇచ్చారు.  

షమీ బౌలింగ్ చేయడం ప్రారంభించాడని గంభీర్ చెప్పారు. షమీని మళ్లీ జట్టులోకి తీసుకునే విషయంపై జాతీయ క్రికెట్ అకాడమీతో సంప్రదించాల్సి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా టీమ్‌లోకి వస్తాడని చెప్పారు.  

సిరాజ్, అర్ష్‌దీప్, బుమ్రాలకు షమీ తోడైతే టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ మరోస్థాయిలో ఉంటుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link