India First Train: దేశంలో తొలి రైలు ఎప్పుడు ఎక్కడ్నుంచి నడిచింది, ఇప్పుడా ట్రైన్ ఉందా లేదా

Sun, 21 Jul 2024-8:08 pm,

ఇండియాలో నడిచిన మొట్టమొదటి రైలు పేరు దెక్కన్ క్వీన్. ఇందులో 14 కోచెస్ ఉన్నాయి. ఈ రైలు స్టీమ్ ఇంజన్ తో నడిచింది. 1853 ఏప్రిల్ 16వతేదీ మద్యాహ్నం 3.30 గంటలు బోరీబందర్ నుంచి ప్రారంభమై 4.45 గంటలకు ఠాణే చేరుకుంది.

ఇండియాలో మొదటిసారిగా రైలు ఆంగ్లేయుల కాలంలోనే నడిచింది. ఈ రైలు 1853వ సంవత్సరం ఏప్రిల్ 16న ముంబైలోని బోరీబందర్ నుంచి ఠాణే వరకూ నడిచింది. ఈ రోజునే ఇండియన్ రైల్వే డేగా జరుపుకుంటారు

భారతదేశంలో నడిచిన మొట్టమొదటి రైలులో 400 మంది ప్రయాణించారు. ఈ సందర్భంగా 34 కిలోమీటర్ల మేర ఉన్న ట్రాక్ ఇరువైపులా రైలును చూసేందుకు భారీగా జనం బారులు తీరారు. 21 సార్లు ఫైరింగ్ జరిపి రైలు ప్రారంభించారు

ఈ మొదటి రైలును లాగేందుకు అప్పట్లో మూడు ఇంజన్లు వినియోగించారు. ఈ ఇంజన్లను అప్పట్లో ఆంగ్లేయులు ఓడల ద్వారా బ్రిటన్ నుంచి రప్పించారు. ఈ ఇంజన్లకు సుల్తాన్, సాహెబ్, సింధ్ అని పేర్లు పెట్టారు

ఇండియాలోని మొట్టమొదటి రైలు దెక్కన్ క్వీన్ ఇప్పుడు ఎక్స్ ప్రెస్ గా మారి ఇంకా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ రైలు ముంబై-పూణే మధ్య నడుస్తోంది. మహారాష్ట్రంలో అత్యంత ఆదరణ పొందిన రైలు ఇది. 

ఇప్పటి ముంబై అప్పట్లో బోంబేగా ఉండేది. 1843లో బ్రిటీషు కాలంలో అప్పటి ఛీప్ ఇంజనీర్ జార్జ్ క్లార్క్ ఈ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ముంబై, కళ్యాణ్, ధాణే ప్రాంతాల్ని కలపాలనే ఆలోచన చేశారు. అందులో భాగంగా పని ప్రారంభమైంది

ఆంగ్లేయులు ఇండియాలో రైల్వేను తమ సొంత అవసరాల కోసం అబివృద్ధి చేశారు. ముంబైలోని అతి పెద్ద పోర్టుకు కనెక్టివిటీగా ఈ తొలి రైల్వే లైన్ ఉండేది

ముంబై-ధాణే మధ్య మొదటి పాసెంజర్ ట్రైన్ నిర్మాణం, నిర్వహణ చేపట్టింది గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే కంపెనీ. ఇది బ్రిటీషుకు చెందిన ప్రైవేట్ కంపెనీ. రెండో కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link