Nagarjuna: నా కోడలు బంగారం.. మరోసారి శోభితపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.. ఏమన్నారంటే..?

శోభిత ధూళిపాళ, చైతుల పెళ్లి ఎంతో గ్రాండ్ గా డిసెంబరు 5 జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంప్రదాయ బద్దంగా కొద్ది మంది అతిథుల మధ్య వీరి పెళ్లి వేడుక జరిగింది.

పెళ్లి తర్వాత కొత్త జంట నాగార్జున శ్రీశైలంకు వెళ్లారు. అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆతర్వాత చైతు, శోభిత పలు కార్యక్రమాలకు కూడా అటెండ్ అయ్యారు.
అయితే.. నాగార్జున ఇటీవల తన కోడలు గురించి ఒక ఇంటర్వ్యూలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. చైతు, శోభితలను చూస్తే తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారంట.
తను ఇంటికి కోడలిగా వచ్చాక.. గొప్ప మార్పులు వచ్చాయని అన్నారంట. శోభితను లైఫ్ జర్నీ గురించి కూడా గొప్పగా చెప్పారంట. ఆమె ఎందరికో ఆదర్శమైందని కూడా అన్నారంట. గతంలో శోభిత మూవీ.. గూఢచారీ చూశాక.. ఫోన్ చేసిన అభినందించినట్లు చెప్పారు.
చైతు, శోభిత జంటను చూస్తే ముచ్చటేస్తుందని కింగ్ అన్నారంట. ప్రస్తుతం నాగార్జున కుబేర, కూలీ మూవీస్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తొంది. మరొవైపు శోభిత కూడా ఇటీవల తను నాగార్జున ఇంటికి తొలిసారి వెళ్లిన అనుభవాల్ని పంచుకున్న విషయం తెలిసిందే.
శోభిత తొలిసారి నాగార్జున ఇంటికి 2018 ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. అదే విధంగా.. 2022 నుంచి చైతుతో మాట్లాడుతున్నట్లు ఆమె తన ఇటీవల చెప్పారు. ఆతర్వాత గోవా, ముంబైలో పర్సనల్ గా కలుసుకున్నట్లు కూడా శోభిత పలు విషయాల్ని తమ ప్రేమను గురించి శోభిత మాట్లాడారు.