Navaratri 2024: భారత్‌లో కాకుండా ఈ 5 దేశాల్లో కూడా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు...

Thu, 03 Oct 2024-1:01 pm,

నేపాల్.. ముందుగా చెప్పుకోవాల్సింది నేపాల్‌. ఈ దేశంలో కూడా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకొంటారు. ఇక్కడ దసరాను దశాయన్‌ అని పిలుస్తారు. మన దేశం మాదిరి ఇక్కడ కూడా స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటిస్తారు. నవదుర్గలను 10 రోజులపాటు పూజించే ఆచారం నేపాల్‌లో కూడా ఉంది.  

ఆస్ట్రేలియా.. నవరాత్రులను ఆస్ట్రేలియాలో కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.ఇక్కడి భారత కుటుంబాలు దుర్గామాతను పూజిస్తారు. ఆస్ట్రేలియాలో 1974 నుంచి దుర్గామాతను పూజిస్తున్నారు. మెల్‌బర్న్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

బంగ్లాదేశ్‌.. సాధారణంగా మన దేశం మాదిరి బంగ్లాదేశ్‌లో కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటారు. అక్కడి హిందువులు దుర్గామాతను పూజిస్తారు. కానీ, ఇటీవల బంగ్లాదేశీయులు హిందువులపై దాడి నేపథ్యంలో ఎలా జరుగుతుందో తెలీదు.

యూఎస్‌ఏ.. ఇక్కడ సెట్టిల్‌ అయిన బెంగాలీలు యూఎస్‌ఏలో 1970లో ప్రారంభించారు.యూఎస్‌ఏ లో ఎక్కువమంది ఉన్నారు. కాబట్టి అక్కడి భారతీయులు ఈ దుర్గామాత పూజను నిర్వహించుకుంటారు. అక్కడి దుర్గా భక్తులు అంతా ఒక్కదగ్గరకు చేరుకుని వైభవంగా దుర్గాపూజలు చేసుకుంటారు.

యూకే.. యూకేలో కూడా దుర్గామాత పూజను వేడుకగా జరుపుకొంటారు. అమ్మ వారి ప్రతిమలను మన దేశంలో మాదిరి ఏర్పాటు చేసుకుంటారు. హిందూ సంప్రదాయబద్ధంగా దుర్గాపూజ చేసుకుంటారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link