AP Rains: ఏపీకి తుపాను ముప్పు.. వాయుగుండం అల్పపీడనం..

Tue, 15 Oct 2024-8:13 am,

AP Rains:అల్ప పీడనం ప్రభావంతో  గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు  పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత వేగంగా పెరుగుతోందని ఐఎండీ అంచనా వేస్తోంది. రేపటికి  తీవ్ర తుపానుగా మారి , చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చని సూచించింది.

తీరం దాటిన తర్వాత బలహీనపడి, అరేబియా సముద్రంలోకి వెళ్లి మళ్లీ అతి తీవ్ర తుపానుగా బలపడుతుందనే అంచనాలున్నాయి. ఇది కేవలం అల్ప పీడనంగానే దక్షిణ కోస్తాలో తీరం దాటొచ్చని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై బుధవారం నాటికి స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

రేపు రెండు, మూడు చోట్ల అత్యంత భారీ వర్షాలకు అవకాశముంది. తీరప్రాంత జిల్లాల్లో గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు తిరిగి రావాలని సూచించారు.

ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి.

వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. అన్ని జిల్లాల కలెక్టర్లను అలర్ట్‌ చేసింది. పండగ సెలవులో ఉన్న అధికారులు విధుల్లోకి రావాల్సిందిగా సూచించింది. NDRF, SDRF టీమ్స్‌ ను ముంపునకు ఆస్కారమున్న ప్రాంతాలకు ముందుగానే పంపిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link