PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ సమ్మన్ నిధి రూ.2000 త్వరలో జమ

దేశానికి వెన్నెముక అయిన అన్నదాతలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.
Also Read: Gold Price Today 12 April 2021: బులియన్ మార్కెట్లో దిగొచ్చిన బంగారం, మిశ్రమంగా వెండి ధరలు

పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా మూడు దఫాలుగా రైతన్నల ఖాతాలలో రూ.2000 చొప్పున మొత్తం 6వేల నగదు జమ చేయనున్నారు. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు రైతుల ఖాతాలకు రూ.2 వేలు జమ చేస్తారు.
Also Read: Samsung Galaxy F12: రెండు రకాల బడ్జెట్ స్మార్ట్ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్

2021లో తొలి విడత నగదు ఏప్రిల్ 20 నుంచి 25 తేదీల మధ్య రైతులకు విడుదల చేయనున్నారని సమాచారం. పీఎం కిసాన్ అర్హులైన లబ్ధిదారులు రూ.2000 అందుకోనున్నారు. నేరుగా రైతుల ఖాతాలలో నగదు జమ అవుతుంది. ఓవరాల్గా ఇది 8వ దఫా చెల్లింపులు. కేంద్ర వ్యవసాయశాఖ, రైతుల సంక్షేమశాఖల మంత్రి కైలాష్ చౌదరి టీవీ9 డిజిటల్తో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.
పీఎం కిసాన్ సమ్మన్ నిధి 8వ దఫా చెల్లింపులకు మొత్తం 11.7 కోట్ల మంది రైతులు లబ్దిదారులుగా ఉన్నారు. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం రైతన్నలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ ఈ ఏడాది తొలి దఫా చెల్లింపుల ప్రక్రియపై ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. గత ఏడాది చివర్లో రూ.20,000 కోట్లు రైతులకు చెల్లించింది. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది.
Also Read: 7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
ఓవరాల్గా రైతన్నల కోసం పీఎం సమ్మన్ నిధి పథకం కింద రూ.65,000 కోట్లను బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. వీటిని ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. అయితే కేంద్రం కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటి ప్రకారమే పీఎం కిసాన్ స్కీమ్ ఎనిమిదవ విడత నగదు విడుదల కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook