Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్‌ ద్వారా ఇలా వెంటనే చెక్‌ చేసుకోండి..

Wed, 02 Oct 2024-7:19 am,

17 విడత పీఎం కిసాన్‌ డబ్బులను  20 వేల కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి రూ.6 వేలు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది. దీనికి మీ ఆధార్‌ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్‌ అయి ఉండాలి. ఈ పథకం ద్వారా 90 మిలియన్ల రైతులు మన దేశంలో లబ్ధి చేకూరనుంది.  

ఈ పీఎం కిసాన్‌ పథకం ద్వారా మీరు కూడా లబ్ది పొందాలంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్లు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో అప్డేడ్‌ అయ్యాయా? లేదా చెక్ చేసుకోండి.  

ఆ తర్వాత హోంపేజీలో న్యూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇది అన్ని భాషల్లో అందుబాటులో ఉంటుంది.  తెలుగు, కన్నడ, మరాఠి, తమిళంలో కూడా ఉంటుంది. ఆ తర్వాత రూరల్‌ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ లేదా అర్బన్‌ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఎంపిక చేసుకోవాలి.  

మీ ఆధార్‌ లేదా మొబైల్‌ నంబర్‌, మీ రాష్ట్రం అక్కడ నమోదు చేయాలి. మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కన్ఫమ్‌ అవుతుంది.

ఆన్‌లైన్‌ ఇ కేవైసీ చెక్‌ చేసుకునే విధానం.. హోం పేజీలోని న్యూ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ద్వారా ఇ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీరు మొబైల్‌ నంబర్‌ ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. స్క్రీన్‌పై నోటిఫికేషన్‌ కూడా వస్తుంది.

పీఎం కిసాన్‌ లబ్దిదారుల జాబితా.. పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా స్టేటస్ చెక్‌ చేయవచ్చు. మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్‌, సబ్‌ డిస్ట్రిక్‌, ఊరు పేరును నమోదు చేయాలి.

పీఎం కిసాన్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునే విధానం.. పీఎం కిసాన్‌ బ్యాలెన్స్‌ 18వ విడత బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవాలంటే మీ ఆధార్‌ కార్డు వివరాలను నమోదు చేయాలి. 'Know Your Status'పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత 'Know your registration number' ఆధార్‌ నంబర్‌తో ఓటీపీ వస్తుంది. ఈ మొబైల్‌ నంబర్‌ క్యాప్చా కోడ్‌ ఉపయోగించాలి. అప్పుడు Get Data పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్‌స్టాల్‌మెంటు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link