PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదల.. నగదు జమా వివరాలను ఇలా ఈజీగా తెలుసుకోండి..

Tue, 18 Jun 2024-8:25 pm,

నరేంద్రమోదీ ఇటీవల ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మోదీ చేత మూడోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు, 71 మంది కేంద్రమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక మోదీ ప్రమాణ స్వీకరం చేశాక తన కార్యాలయంలో తొలిసంతకం కిసాన్ సమ్మాన్ 17 వ ఇన్ స్టాల్ మెంట్ డబ్బుల చెల్లింపు ఫైల్ మీద సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తుంది. 

ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సహయం అందించడమే టార్గెట్ గా మోదీసర్కారు ఈ పథకం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రైతులు ఆనందగా ఉంటేనే.. దేశం బాగుపడుతుందని మోదీ తరచుగా చెబుతుంటారు. 

ప్రతి ఏటా అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు పెట్టుబడి సాయంగా కేంద్ర ఇస్తుంది. దీనిలో భాగంగానే మోదీ ఈరోజు వారణాసిలో పీఎం కిసాన్ సమ్మాన్ 17  వ విడత నిధులను విడుదల చేశారు. 

దీంతో 9.26 కోట్లు రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున, దేశంలో రూ. 20 వేల కోట్లు జమకానున్నాయి.. లోక్ సభ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత మోదీ తొలిసారి వారణాసికి వెళ్లారు. 

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 17వ విడత డబ్బు మీ ఖాతాలో జమ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. మొదట మీ అకౌంట్ లో డబ్బులు జమకాగానే.. అకౌంట్ అనుసంధానం ఉన్న ఫోన్ కు మెస్సెజ్ వస్తుంది. 

మీ మొబైల్ నంబర్‌కు మెసేజ్ రాకపోతే... మీ సమీపంలోని ATM ను సందర్శించాలి. ఏటీఎం మెషీన్‌లోని మినీ స్టేట్‌మెంట్‌ను బయటకు తీయడం ద్వారా 17వ విడత డబ్బు ఖాతాలోకి బదిలీ అయిందో లేదో తెలుసుకోవచ్చు. 

మీ ఖాతాలో వాయిదా డబ్బులు రాలేదని మీరు భావిస్తే... ఈ పరిస్థితిలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్  https://www.pmkisan.gov.in/Contacts.aspx ని సందర్శించడం ద్వారా మీ సమస్య గురించి సంప్రదించవచ్చు  .

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link