Pragya jaiwal: ఎద అందాలను ఓపెన్ చేసేసిన ప్రగ్యా జైస్వాల్ .. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోన్న అఖండ భామ..

Tue, 26 Mar 2024-8:04 pm,

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్ కాక ముందు మోడల్‌గా పనిచేసింది. ఆపై సినిమాల్లో లక్ పరీక్షించుకుంది.

నటిగా ప్రగ్యా జైస్వాల్‌కు తొలి సినిమా తమిళంలో విడులైన 'విరాట్టు'.. అటు హిందీలో టిటూ ఎంబీఏ సినిమాలో నటించింది. కానీ పెద్దగా ఒరిగిందేమి లేదు. 

ప్రగ్యాకు తెలుగులో ఫస్ట్ మూవీ 'మిర్చి లాంటి కుర్రాడు'.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ  క్రిష్‌ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' మూవీతో పాపులర్ అయింది.

కంచె మూవీ తర్వాత వరుసగా తెలుగులో 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించింది ప్రగ్యా జైస్వాల్. కానీ హిట్టు మాత్రం అందుకోలేకపోయింది.

ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఈ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకే వెళ్లింది. ప్రగ్యాకు పెద్దగా ఒరిగిందేమి లేదు.

ప్రగ్యా జైస్వాల్..  తెలుగులో చివరగా మోహన్ బాబు హీరోగా నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాతో పలకరించింది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం 'ఖేల్ ఖేల్ మే' అనే సినిమాలో నటిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link