Ram Charan visits Tirumala: పుట్టినరోజు సందర్బంగా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్..

Wed, 27 Mar 2024-10:19 am,

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్‌ ఆలయ పూజారులు తీర్ధ ప్రసాదాలు అందజేసారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ వెంట భార్య ఉపాసన, కూతురు క్లీంకార ఉన్నారు.

కూతురు క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్ జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇదే కావడం విశేషం.

ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు.

మరోవైపు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త సినిమా రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ 17వ చిత్రం అనౌన్స్‌మెంట్ జరిగింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link