Raveena Tandon: రూ. 100 కోట్ల పరువు నష్టం దావావేసిన రవీనా.. కారణం ఏంటో తెలుసా..?

Sat, 15 Jun 2024-6:24 pm,

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. డ్రగ్స్ కేసులో నటి హేమ, కన్నడ నటుడు, దర్శన్, పవిత్ర గౌడ, బీజేపీ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్, రవీనా టాండన్ లు ఇటీవల వివాదస్పద ఘటనల వల్ల ట్రెండింగ్ లో ఉన్నారు. 

ముంబైలోకి తన నివాసంలో రవీనా తన కారులో ఉన్నారు. అప్పుడు కారును రివర్స్ తీసుకుంటున్నారు. ఇంతలో ఆకారు కాస్త ముగ్గురిని ఢీకొట్టింది. గాయపడిన వారు డ్రైవర్ ను నిలదీశారు. కారులు ఉన్న రవీనా.. బైటకు వచ్చి బాధితులపైన ఫైర్ అయ్యింది.

దీంతో చాలా సేపు రోడ్డు మీద న్యూసెన్స్ జరిగింది. ఈ నేపథ్యంలో.. నటి రవీనా పట్ల అక్కడున్న వారు దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఘటనను వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టులు సైతం చేశారు. 

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కొందరు నటి కంగానా ఆ సమయంలో తాగి ఉన్నారంటూ కూడా కామెంట్లు చేశారు. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఘటన జరిగినప్పుడు రవీనా టాండన్ తాగిలేరని కూడా పోలీసుల విచారణలో తెలింది. ఈ క్రమంలో కొందరు తన ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని ఆమె ఫైర్ అయ్యారు.

సోషల్ మీడియాలో తొలుత రవీనా.. లిక్కర్ తాగినట్లు పోస్టుపెట్టిన వ్యక్తిని గుర్తించారు. లాయర్ ద్వారా నోటీసులు పంపి, వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ ఘటన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హట్ టాపిక్ గా మారింది.

ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని, ఇలాంటి పోస్టుల వల్ల తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటూ కూడా రవీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link