Secunderabad Agnipath Protests: రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌.. లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Fri, 17 Jun 2022-1:57 pm,

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం ఘటనపై వివరాలను అమిత్‌షాకు వివరించారు.   

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది.   

సికింద్రాబాద్‌లో ఆందోళన నేపథ్యంలో నాంపల్లి రైల్వే స్టేషన్‌ను పోలీసులు మూసేశారు. ప్రయానికులు రావొద్దని పోలీసులు హెచ్చరించారు.   

ఆందోళనకారుల దాడిలో మూడు రైళ్లు ధ్వంసం అయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పార్శిల్‌ రైలుతో పాటు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో 2 బోగిలు దగ్ధం అయ్యాయని పేర్కొంది.  

రైల్వేట్రాక్‌, ప్లాట్‌ఫామ్‌లు గందరగోళంగా మారిపోయాయి. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడికి వచ్చిన ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.  

ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అరంగట పాటు కొనసాగిన ఆందోళనతో రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. పార్సిల్‌ కార్యాలయంలో ఉన్న బైకులు, ఇతర సామన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.   

అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా విరుచుకుపడిన విద్యార్థులతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో యుద్ధవాతావరణం నెలకొంది.  

సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్‌' విధానంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రణరంగంగా మారింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link