COVID-19 vaccine తీసుకుంటే ఇక పిల్లలు పుట్టరా ?
కరోనా వ్యాక్సిన్పై వస్తున్న వదంతులకు, అపోహలకు ( Myths of COVID-19 vaccine ) చెక్ పెడుతూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ట్విటర్ ద్వారా గ్రాఫిక్స్ రూపంలో స్పందించారు.
COVID-19 vaccine తీసుకున్న తర్వాత కొంతమందిలో కొద్దిపాటి జ్వరం, ఇంజెక్షన్ తీసుకున్న చోట నొప్పి, ఒళ్లు నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడం కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏవి అయినా.. అవి దీర్ఘకాలం పాటు ఉండవని, కొద్ది రోజుల్లోనే వాటంతట అవే తగ్గిపోతాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.
Coronavirus vaccine కారణంగా సంతానం కలిగే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందనే ప్రచారాన్ని బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పష్టంచేశారు.
కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం అధికారికంగా అందించే సమాచారాన్ని తప్ప ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే అనధికారిక సమాచారాన్ని విశ్వసించకూడదని కేంద్ర మంత్రి ( Union Health Minister Harsh Vardhan ) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్కి చెక్ పెట్టేందుకు తయారైన వ్యాక్సిన్ వినియోగంపై వస్తున్న వదంతులకు, అపోహలకు ఈ విధంగా సమాధానం చెప్పిన కేంద్రం