This Week Tollywood Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న కొత్త సినిమాలివే...

Tue, 03 May 2022-12:37 pm,

జయమ్మ పంచాయితీ :

ప్రముఖ స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'జయమ్మ పంచాయితీ.' గ్రామీణ కుటుంబ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయమ్మ ఓ సమస్య విషయంలో ఊరి పెద్దలను ఆశ్రయించి పంచాయితీ పెట్టడమనే లైన్ చుట్టూ సినిమా కథ నడవనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సినిమాలో దేవీ ప్రసాద్, దినేశ్, శాలినీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.

భళా తందనాన :

శ్రీ విష్ణు-కేథరిన్ హీరో హీరోయిన్లుగా చైతన్య దంతలూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం 'భళా తందనాన'. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. మే 6న ఈ సినిమా విడుదల కానుంది. సోమవారం (ఏప్రిల్ 2) విడుదలైన భళా తందనాన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

అశోక వనంలో అర్జున కల్యాణం :

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన 'అశోక వనంలో అర్జున కల్యాణం' చిత్రం ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్వీసీసీ నిర్మాణ సంస్థలో బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఈ సినిమా రానుంది. రుక్సర్ దిల్లాన్ ఇందులో హీరోయిన్. తెలంగాణ అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి పెళ్లి అనే కాన్సెప్టుతో  ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.  

వచ్చే వారం సర్కారు వారి పాట :

సూపర్ స్టార్ మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' ఈ నెలలో రిలీజ్ కానున్న బిగ్ సినిమాగా చెప్పొచ్చు. వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో మణిశర్మ సంగీతంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం (మే 2) రిలీజ్ అయిన ట్రైలర్‌ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link