Sunrisers Hyderabad: ఆర్సీబీని ఓడించి కోహ్లీ, డివిలియర్స్‌తో చిట్కాలు

Sun, 01 Nov 2020-3:48 pm,

గతంలో ఎన్నడూ లేనంతగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి మజాను అందిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. 

ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచి ఉంటే బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరేది. కానీ బ్యాటింగ్‌లో తడబడటంతో విరాట్ కోహ్లీ సేన కీలక సమయంలో చిక్కుల్లో పడింది. (All Images credit: Twitter/@SunRisers)

ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లు సైతం విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌తో చర్చించి కొన్ని టిప్స్ తెలుసుకున్నారు. ఆర్సీబీ, సన్‌రైజర్స్ ఆటగాళ్లు స్పోర్టివ్ స్పిరిట్‌ను ప్రదర్శించారు.

నవంబర్ 3న జరగనున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్ కారణంగా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. లేకపోతే ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమిస్తుంది.

(All Images credit: Twitter/@SunRisers) ఈ ఫొటోలను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ట్విట్టర్‌ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link