Pitru paksham 2024: పితృపక్షంలో బిడ్డ పుడితే అశుభమా? వారి లక్షణాలు ఎలా ఉంటాయి?

Tue, 24 Sep 2024-10:55 am,

పితృపక్షం సమయంలో చనిపోయిన మన పూర్వీకులు భూమిపై సంచరిస్తారని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో వారికి తర్పణం, పిండ ప్రదానం వంటివి చేస్తారు. పితృదోషంతో బాధపడుతున్నవారికి వంశాభివృద్ధి ఆర్థికంగా ఎదుగుదల ఉండదు.  

పితృపక్షంలో దానం చేయడం కూడా ప్రామఖ్యత సంతరించుకుంటుంది. బ్రాహ్మణులకు, గోవుకు, నిరుపేదలకు దానధర్మాలు చేస్తారు. భూమిపైకి ఈ పక్షం రోజుల్లో మన పూర్వీకులు మనల్ని ఆశీర్వదించడానికి వస్తారు. అందుకే తిథిల ప్రకారం తర్పణం వంటివి చేస్తారు.  

పితృపక్షంలో ఏవైనా శుభకార్యాలు నిర్వహించడం అశుభం. అందుకే ఈ పక్షంలో సమయంలో ఎలాంటి కార్యాలు చేయరు. ఆ పక్షం రోజులు కొత్త వస్తువులు కొనుగోలు చేయరు. పితరుల ఆత్మ శాంతి కలగాలని పిండ ప్రదానం వంటివి చేస్తారు.   

ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైంది. ఇది అక్టోబర్‌ 2 మహాలయ అమావాస్య లేదా సర్వపితృ అమావాస్యతో ముగుస్తుంది. అయితే, ఈ పక్షం రోజుల్లో ఎవరికైనా బిడ్డ పుడితే శుభమా? అశుభమా? ఆ బిడ్డ లక్షణాలు ఎలా ఉంటాయి?  

పితృపక్షంలో పుట్టిన బిడ్డ పుడితే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో పుట్టిన పిల్లలు చాలా తెలివైనవారు. ఆ ఇంట్లోవారికి సుకఃశాంతులు వెల్లివిరుస్తాయి. పితృపక్షంలో పుట్టిన పిల్లలు సృజనాత్మకతతో ఆలోచిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link