Chinab Rail Bridge: 8వ వింతగా ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైలు వంతెన, త్వరలో రైల్వే సేవలు

Sat, 15 Jun 2024-10:21 pm,

ఈ వంతెన నది అడుగు భాగం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఉధమ్‌పూర్-శ్రీనగర్ -బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగం ఇది. ఈ వంతెన కట్రా నుంచి బనిహాల్‌ను కలుపుతుంది. 

ఇది భారతీయ ఇంజనీర్ల ప్రతిభ, సామర్ధ్యానికి నిదర్శనమంటున్నారు రైల్వే అధికారులు. ఈ వంతెనను ప్రపంచంలోని 8వ వింతగా అభివర్ణిస్తున్నారు. త్వరలోనే ఈ వంతెనపై రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి. 

ఈ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం అందించిన ఇంజనీరింగ్ అద్భుతంగా ఈ వంతెనను అభివర్ణిస్తున్నారు. 

జమ్ము కశ్మీర్‌లోని రియసీ జిల్లాలో బక్కల్-కౌడీ మధ్యలో చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ వంతెన. రైల్వే అదికారులు ఇటీవలే ఈ వంతెనను పరీక్షించారు. 

జమ్ము కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో లోయల్లోంచి ప్రవహించే అందమైన చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనతో రాంబన్-రియాసీ మధ్య రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఉత్తర రైల్వే ప్రకారం ఈ వంతెన పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో నిర్మించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link