Dead Man Returns Home in Goa: గోవాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. తమ వ్యక్తి మరణించాడని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించగా.. మూడు నెలలో తరువాత ఆ వ్యక్తి అనూహ్యంగా ప్రత్యక్షమై ఊహించని షాకిచ్చాడు. చనిపోయాడని అనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గోవా రాజధాని పనాజీ సమీపంలోని అగస్సైమ్ గ్రామానికి చెందిన మార్కోస్ మిలాగ్రెస్ (59) అనే వ్యక్తి గతేడాది చివర్లో కనిపించకుండా పోయాడు. 
 
ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబరు 7న పనాజీలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమవ్వగా.. మిలాగ్రెస్ కుటుంబ సభ్యులకు పోలీసులు చూపించగా.. తమ వ్యక్తేనని గుర్తించారు. సమీపంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే రెండు నెలల తర్వాత గోవా పోలీసులకు వారి ముంబై పోలీసుల నుంచి కాల్ వచ్చింది. మిలాగ్రెస్ అనే వ్యక్తి అగస్సైమ్ నివాసి అని చెప్పుకుంటున్నాడని చెప్పారు. ఆ వ్యక్తిని అగస్సైమ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా.. అక్కడ అతని కుటుంబ సభ్యులు వచ్చి మిలాగ్రెస్‌గా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా ముంబై వెళ్లినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే మిలాగ్రెస్ కుటుంబానికి ఎవరి మృతదేహాన్ని అప్పగించారనేది ఇంకా తెలియరాలేదు.  


Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!


Also Read: Oneplus Buds 3 Price: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌..చీప్‌గా మార్కెట్‌లోకి OnePlus బడ్స్‌ 3..ధర, ఫీచర్స్‌ వివరాలు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి