Honeymoon Tragedy: కొత్తగా పెళ్లితర్వాత చాలా మంది జంటలు హనీమూన్ లకు వెళుతుంటారు. ఏదైన కొత్త ప్రదేశానికి వెళ్లి ఏకాంతగా గడపడానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు. కొందరు గోవాల, కేరళ, కశ్మీర్, విదేశాలకు కూడా వెళ్తుంటారు. కానీ మరికొందరు మాత్రం దీనికి భిన్నంగా ఆలయాలను సందర్శిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని సార్లు కొత్తగా పెళ్లైన తర్వాత దంపతులు మధ్య ఇష్టాలు పూర్తిగా భిన్నంగా కూడా ఉంటాయి. దీనితో కొత్తగా జీవితంలో అడుగుపెట్టకుండానే గొడవలు ప్రారంభమవుతాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.  


పూర్తి వివరాలు..


మధ్య ప్రదేశ్ లోని గోవాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్యనే భోపాల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగికి, మరో యువతితో పెళ్లి జరిగింది. వివాహం తర్వాత ఇద్దరు కూడా హనీమూన్ వెళ్లాలనుకున్నారు. ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మహిళ.. గోవాకు హనీమూన్ వెళ్లాలని పట్టుపట్టింది.


అయితే.. ఆమె భర్త మాత్రం అయోధ్యకు వెళ్దామని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు సంభవించాయి. అంతే కాకుండా గొడవలు పీక్స్ కు వరకు వెళ్లాయి. ఈ క్రమంలో సదరు యువతి ఆవేశంలో ఒక అడుగు ముందుకేసి కోర్టులో డైవర్స్ కోసం కూడా పిటిషన్ వేసింది. దీంతో వీరి కేసును విచారించిన న్యాయమూర్తి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook