Viral News: మార్కెట్లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిమ్మకాయల ధరలపై తీవ్ర డిమాండ్ ఏర్పడింది. దీంతో నిమ్మకాయల ధరలపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్, జోక్స్ వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ ఆసక్తికరమైన పిక్ నెట్టింట వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఇంటి దిష్టి కోసం నిమ్మకాయలు, ఎండు మిర్చి కలిపి గుమ్మానికి కట్టేవారు ఉన్నారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకాయ, ఎండు మిర్చి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఓ వ్యక్తి తన ఇంటి గుమ్మానికి పచ్చి మిర్చితో పాటు నిమ్మకాయ స్థానంలో వెల్లుల్లితో దిష్టి గుమ్మానికి కట్టాడు. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. 


ఫోటో షేర్ చేసిన ఐపీఎస్ అధికారి..



ఈ ఫన్నీ ఫోటోను ఐపీఎస్ అధికారి రూబిన్ శర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దానికి ఓ ఫన్నీ టైటిల్ కూడా పెట్టాడు. తన శీర్షికలో 'పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని.. నిమ్మకాయ లేకపోవడం వల్ల వెల్లుల్లిని డిప్యూటేషన్‌పై ఉంచారు. ఇప్పుడు ఈ పనికి వెల్లుల్లి బాధ్యత వహిస్తుంద"ని రూబిన్ శర్మ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Idly Ice Cream: ప్రపంచలోనే అతి చెత్త ఫుడ్ కాంబినేషన్.. చూస్తే కోపం సంగతి ఏమో కానీ వాంతులు పక్కా!


Also Read: Shocking News: పగబట్టిన నాగుపాము.. ఒకే వ్యక్తిని 7 సార్లు కాటేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook