Antarvedi new chariot: గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి అంతర్వేది లక్ష్మీ నరశింహస్వామి ఆలయం. ఆలయం రధం కోటి పది లక్షల ఖర్చుతో అత్యంత సుందరంగా నిర్మితమై సంప్రోక్షణకు సిద్ధమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )  తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ( Antarvedi )లో వెలసిన లక్ష్మీ నరశింహస్వామి ఆలయం ఇప్పుడు కొత్త సొబగులు అద్దుకుంది. కొత్త రధాన్నిసంతరించుకుంది. 2020 సెప్టెంబర్ 5న గుర్తు తెలియని దండగులు అంతర్వేది ఆలయంలో ఉన్న 62 ఏళ్ల చరిత్ర కలిగిన రధాన్ని దగ్దం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) సీరియస్‌గా తీసుకుంది. సీబీఐ దర్యాప్తు ( CBI Probe ) కు అప్పగించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన కొత్త రధాన్ని నిర్మించే చర్యలు చేపట్టింది.


కోటి పది లక్షల ఖర్చుతో 43 అడుగుల ఎత్తుతో..ఏడు అంతస్తుల్లో కొత్త రధాన్ని అనుకున్న సమయం కంటే ముందే నిర్మించారు. ఇటీవలే అంతర్వేది కొత్త రధం ( Antarvedi new chariot ) ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ప్రమాదాల్ని నివారించేందుకు హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడీ రధానికి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 13న సంప్రోక్షణ చేపట్టేందుకు నిర్ణయించారు. ముఖ్య అతిధులుగా విశాఖ శారదా పీఠాధిపతుల్ని ఆహ్వానించారు. ఫిబ్రవరి  11 నుంచి మూడ్రోజుల పాటు సంప్రోక్షణ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఆగమన శాస్త్రం ప్రకారం చేపట్టాలని స్వామి స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. 


Also read: Hundi Collections: నిన్న Tirumala Temple హుండీకి భారీగా ఆదాయం: TTD అధికారులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook