COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Diwali Horoscope Effect On 2024: దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ పండగ కార్తీక మాసంలోని కృష్ణపక్షం అమావాస్య రోజున వస్తుంది. ఈ సంవత్సరం అమావాస్య తిథి నవంబర్ 12వ తేదీన వచ్చింది. అయితే ఈ రోజే కొన్ని గ్రహాలు వాటి స్థితిని మార్చుకోబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాజయోగాలతో పాటు అతి శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. దీపావళి పండగ రోజు ఈ రాజయోగాలు ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి సంతోషం శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


అంతేకాకుండా ఇదే సమయంలో చంద్ర, కుజ గ్రహాలు తులా రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా మహాలక్ష్మి రాజయోగ ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షంగా పడి వ్యక్తిగత జీవితాల్లో బంపర్ ప్రయోజనాలు పొందడమే కాకుండా ఆస్తులు, ఐశ్వర్యాలు లభించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ యోగ ప్రభావం 2024 సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఈ దీపావళి పండగ రోజున ఏర్పడిన మహాలక్ష్మి రాజ్య యోగం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:
దీపావళి రోజు ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగ ప్రభావం మేష రాశి వారిపై పడబోతోంది దీని కారణంగా ఈ రాశి వారికి 2024 సంవత్సరం వరకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభించడం వల్ల వీరికి సంపాదన పెరుగుతుంది అంతేకాకుండా ఇంతకుముందు పనిలో ఏర్పడిన అడ్డంకులని తొలగిపోతాయి తెలివితేటలు పెరగడం కారణంగా పనులలో కొత్త ఎత్తులు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇతర సమస్యలతో బాధపడేవారు తెలివితేటలను ఉపయోగించి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగాల్లో కష్టపడి పనులు చేసే వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక విద్యార్థులకైతే చదువులపై ఏకాగ్రత పెరిగి మంచి ర్యాంకులు సంపాదిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంతకుముందు ఉన్న అప్పులను కూడా సులభంగా తీర్చుకోగలుగుతారు. ఇక ఎప్పటి నుంచో తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఈ మహాలక్ష్మి రాజయోగం కారణంగా విముక్తి లభిస్తుంది.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


సింహ రాశి:
సింహ రాశి వారిపై కూడా మహాలక్ష్మి రాజయోగ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో సింహ రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు. అయితే సింహరాశి వారికి ఈ ప్రభావం 2024 సంవత్సరం వరకు కూడా ఉంటుంది. ఈ రాజయోగ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీనిని కారణంగా జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఇక కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ సమయంలో ఆనందం రెట్టింపు అవుతుంది అంతేకాకుండా జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీరు పిల్లలపై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా భూములు కొనుగోలు చేసి కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పనులను ప్రోత్సహించేందుకు మీ జీవిత భాగస్వామి మీకు ఎప్పుడూ తోడు ఉంటుంది.



మకరరాశి:
మహాలక్ష్మి రాజయోగ ప్రభావం కారణంగా మకర రాశి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. 2024 సంవత్సరంలో మకర రాశి వారు మంచి లాభాలు పొందుతారు అంతేకాకుండా మతపరమైన కార్యక్రమాలపై మరింత ఆసక్తి పెంచుకుంటారు. ఈ సమయంలో ఇతరులకు సహాయం చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరంలో సమాజంలో మంచి గుర్తింపు తో పాటు పేరు సంపాదించుకుంటారు. ఇక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మంచి కంపెనీలు ఉద్యోగం లభిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక వృత్తి జీవితాన్ని గడుపుతున్న వారికి మంచి పురోగతి లభిస్తుంది. ఈ సమయంలో ప్రేమ జీవితంలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. ఈ మార్పులే వివాహానికి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక లక్ష్మీదేవి ఆశీస్సులతో కోర్టు కేసులు ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన తీర్పు లభిస్తుంది.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook