Mithun Sankranti 2022: సూర్యుడు మిథునరాశిలో ప్రవేశించిన రోజునే  'మిథున సంక్రాంతి' (Mithun Sankranti) అంటారు. ఇది ఇవాళ అంటే జూన్ 15న జరుపుకుంటున్నారు. ఏడాదిలో 12 సంక్రాంతులు ఉంటాయి. సూర్యుడు ఒక్కోరాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ రోజున సూర్య భగవానుడిని పూజిస్తారు. నేటి నుండి వర్షాకాలం ప్రారంభం అవుతుందని నమ్ముతారు. ఈ రోజున వర్షాలు బాగా కురవాలని ప్రజలు దేవుడికి ప్రార్థనలు చేస్తారు. ఈ మిథున సంక్రాంతిని 'రాజ్ సంక్రాంతి' (Raja Sankranti 2022) అని కూడా అంటారు. ఈ రోజున సిల్బట్టాను పూజిస్తారు. అసలు ప్రజలు సిల్బట్టాను ఎందుకు పూజిస్తారు, దీని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిల్బట్టాను ఎందుకు పూజిస్తారు?
స్త్రీలకు రుతుక్రమం ఉన్నట్లే.. భూతల్లికి కూడా రుతుక్రమం ఉంటుందని ప్రజలు నమ్ముతారు. బహిష్టు అనేది శరీర ఎదుగుదలకు ప్రతీక. ఈ రోజున భూ తల్లి రుతుస్రావం కారణంగా భూమి అభివృద్ది చెందుతుంది. నాల్గవ రోజు భూమి స్నానం చేసే రోజు.  ఈ రోజును 'వసుమతీ గాధువా' అని కూడా అంటారు. సిల్బట్టా మాతృభూమి యెుక్క రూపం. మెుదటి మూడు రోజులు దీనిని ఉపయోగించరు. నాల్గో రోజు సిల్బట్టాను ఉపయోగించే ముందు, దానిని నీటితో మరియు పాలతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత గంధం, వెర్మిలియన్, పండ్లు మరియు పుష్పాలతో దానిని పూజిస్తారు. ఈ రోజున గోధుమలు, బెల్లం, నెయ్యి, ధాన్యాలు (బార్లీ) మొదలైన వాటిని దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.


Also Read: Mithun Sankranti 2022: మిథున సంక్రాంతి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook