అంబటి రాయుడు తన అభిమానులను షాకింగ్‌కి గురిచేస్తూ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఐసిసి ప్రపంచ కప్‌లో బ్యాకప్ ప్లేయర్‌గా వున్న అంబటి రాయుడుకి జట్టు తరుపున ఆడే అవకాశం ఇవ్వకుండా శిఖర్ ధావన్ గాయపడి ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు అతడి స్థానంలో రిషబ్ పంత్‌ని జట్టులోకి తీసుకున్న బీసీసీఐ.. ఆ తర్వాత విజయ్ శంకర్ గాయం కారణంగా టోర్ని నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు సైతం అంబటి రాయుడుని పరిగణలోకి తీసుకోకుండా మయంక్ అగర్వాల్‌ని జట్టులోకి ఎంపిక చేసుకోవడం అంబటి రాయుడిని మనస్తాపానికి గురిచేసింది. ఈ కారణంగానే రాయుడు క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలోనే తాను క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు అంబటి రాయుడు బీసీసీఐకి వెల్లడించినట్టు సమాచారం. నేటి తరం క్రికెట్‌లో వివిఎస్ లక్ష్మణ్ తర్వాత క్రికెట్‌లో మెరిసిన తెలుగు తేజంగా అంబటి రాయుడు మంచి పేరు తెచ్చుకున్నాడు.