IND vs PAK: టీ 20 ప్రపంచ కప్‌(T20 World Cup 2021)లో భారత్‌ ఓటమి చెందడంతో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా(Kodagu District) సోమవారపేట తాలూకా దొడ్డబళె గ్రామానికి చెందిన ఉదయ్‌ (50) క్రికెట్‌ అభిమాని(Cricket Fan). ఆదివారం రాత్రి జరిగిన భారత్‌–పాకిస్తాన్‌ మ్యాచ్‌ తిలకిస్తూ.. టీమిండియా(Teamindia) ఓటమి అంచున ఉండటంతో ఉదయ్‌ తీవ్ర ఒత్తిడికి గురియ్యాడు. దీంతో అతడికి గుండెపోటు(Cardiac Arrest) వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యలో మృతి చెందాడు.  


Also Read: India vs Pakistan Match: టీమ్ ఇండియా రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్


ఆదివారం జరిగిన దాయాదుల పోరులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌(Pakistan) ఏ మాత్రం తడబాటు లేకుండా, వికెట్‌ నష్టపోకుండా అలవోకగా విజయం సాధించింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి