Ind vs Aus: పెర్త్ వేదికగా జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ మూడో రోజు భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆల్ అవుట్ అయినా రెండో ఇన్నింగ్స్‌లో దుమ్ము రేపుతోంది. కేఎల్ రాహుల్-యశస్వి జైశ్వాల్ భారీ ఓపెనింగ్ భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించారు. 38 ఏళ్ల రికార్డును బద్దలు గొట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ ముడో రోజు ఇండియా బ్యాటర్లు ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. మొదటి వికెట్‌కు యశస్వి జైశ్వాల్-కేఎల్ రాహుల్ రికార్డు స్థాయి ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ కలిసి ఏకంగా 201 పరుగులు చేశారు. గతంలో ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 1986 సిడ్నీ టెస్టులో సునీల్ గవాస్కర్, శ్రీకాంత్ పేరిట 191 పరుగులుండేది. రెండవ అత్యధిక భాగస్వామ్యం సునీల్ గవాస్కర్-చేతన్ చౌహాన్ కలిసి 165 పరుగులు చేశారు. ఇప్పుడు కేఎల్ రాహుల్-యశస్వి జైశ్వాల్ కలిసి 201 పరుగులతో ఈ రికార్డుల్ని బ్రేక్ చేశారు. కేఎల్ రాహుల్ 77 పరుగులు చేసి అవుట్ కాగా జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు. జైశ్వాల్‌కు మొదటి టెస్ట్ సెంచరీ ఇది. టీమ్ ఇండియా మూడో రోజు ఆట ముగియకుండానే 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ మొత్తం 162 పరుగులు చేశాడు. 


ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై 350 పరుగుల ఆధిక్యంలో ఉంది. రేపు మద్యాహ్నం వరకూ ఆడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాతో తొలి పర్యటనలోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లి సరసన చేరాడు యశస్వి జైశ్వాల్. 


Also read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ ఎవరికి, అందరి దృష్టి ఆ ఆటగాళ్లపైనే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.