ఇండోర్ : రెండో టీ20లో శ్రీలంక నిర్దేశించిన 142 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేధించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లో కేఎల్ రాహుల్ 45, శిఖర్ ధావన్ 32, శ్రేయాస్ అయ్యర్ 34,కెప్టెన్ విరాట్ కోహ్లీ 30 పరుగులు చేశారు. 


శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో పెరేరా 34, ఫెర్నాండో 22 పరుగులు చేశారు. 20 ఓవర్లు ఆడిన శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, నవ్‌దీప్ షైనీ రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ లు చెరో వికెట్ తీశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..